బ్రేకింగ్ : కాంగ్రెస్ కి ఖుష్బూ గుడ్ బై.. రేపు బీజేపీలోకి

-

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తమిళ రాజకీయాల్లో అనేక పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు తమిళనాడు కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న కుష్బూ కమలం గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం12 : 30 గంటలకి ఆమె బీజేపీలో చేరనున్నారు.

ఇక వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముందు కొట్టుకున్న అధికార పార్టీ నేతలు కూడా ఇప్పుడు ఒక ఒప్పందానికి వచ్చారు. మరో పక్క డీఎంకే అధినేత స్టాలిన్ కూడా తన వయసుకు మించి కష్టపడుతున్నారు. ఈ ఎన్నికల్లో సినీ ప్రముఖులు అయిన కమల్ హాసన్, రజనీకాంత్ లు కూడా పోటీ చేస్తుండడంతో ఈ ఎన్నికల మీద ఆసక్తి నెలకొంది. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలు కూడా ఈ ఎన్నికల లో సత్తా చాటాలని చూస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news