ఐపీఎల్‌లో నేడు కీలక పోరు..ఆ జట్టుకు ఇది డూ ఆర్‌ డై మ్యాచ్‌

-

అబుదాబి వేదికగా ఢిల్లీ కేపిటల్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ హాట్ హాట్ సమరానికి రంగానికి సిద్దమైంది. రెండు జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి..నేడు ఐపీఎల్‌లో కీలక పోరు జరగనుంది..విజయ పరంపరను కొనసాగిస్తు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకోవాలని చూస్తున్న ఢిల్లీ కేపిటల్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది..వరుస పరాజయాలతో సతమతమౌతున్న కొల్‌కతాకు ఈ మ్యాచ్‌ కీలకం కానుంది..విజయమో.. వీర స్వర్గమే తేల్చుకునేందుకు ఢిల్లీతో పోటీ పడుతుంది..ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే కల్‌కతా ఖచ్చితంగా మ్యాచ్‌లో గెలవాలి..ఈ పోరులో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలని కోల్‌కతా పట్టుదలతో ఉంది.రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం నైట్ రైడర్స్ ను కలవరపరుస్తోంది. ఈ మ్యాచ్‌లో 20ఓవర్లలో కేవలం 84 పరుగులకే కోల్‌కతా పరిమితమైంది. ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కోల్‌కతా.. దీని ప్రభావం నుంచి బయటపడి, తర్వాతి మ్యాచుల్లో గెలిచి , ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తామన్నారు కోచ్ మెక్‌కల్లం. మరోవైపు ఢిల్లీ కేపిటల్స్ చక్కని ఆటతీరు కనబరుస్తూ పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది. శిఖర్ దావన్ మంచి ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కొండంత బలంగా కనిపిస్తోంది. అయితే ఆటగాళ్లు సమష్టిగా రాణించకపోవడంతో జట్టు విజయంలో కొంత ఇబ్బందులు కలగవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news