మూడు రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపించాడు…!

-

పోలీసుల అదుపులో ఉన్న ఎర్రచందనం అంతరాష్ట్ర బడాస్మగ్లర్ భాష భాయ్ కి సంబంధించి ఇప్పుడు పోలీసులు పలు కీలక విషయాలను బయటకు లాగుతున్నారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు వెళ్లి కడప ప్రత్యేక పోలీసు బృందం మెరుపు దాడులు చేసింది. ఎర్ర మాఫియా ఢాన్ భాషా భాయ్ ని కోయంబత్తూరు లో అదుపులోకి తీసుకున్నారు.

తమిళనాడు, కర్ణాటక రెండు రాష్ట్రాల్లో మకాం వేసి ఏపీలోని రాయలసీమ అడవుల్లో ఎర్రచందనాన్ని అతను దోచేస్తున్నాడు. కడప, చిత్తూరు జలా అడవుల మీద అతనికి ప్రత్యేక పట్టు ఉంది. మూడు రాష్ట్రాల పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలించారు. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమైన తమిళ స్మగ్లర్ల కేసులో ప్రధాన ముద్దాయిగా అతన్ని గుర్తించారు. ఈ కేసు మీద ఏపీ పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news