బ్రేకింగ్ : కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి

-

దేశంలో శరవేగంగా వ్యాప్తిచెందుతున్న కరోనా వైరస్ సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ప్రజా ప్రతినిధులపై కూడా ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతోంది. దీంతో రోజురోజుకు కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. తాజా బిజెపి నేత, రాజస్థాన్‌ లోని రాజ్‌ సమండ్‌ కు చెందిన ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి హర్యానా గురు గ్రామ్‌ లోని మేదంతా ఆసుపత్రిలో ఈ తెల్లవారుజామున మరణించారు.

corona
corona

ఆమెకు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలడంతో గురుగ్రామ్ మేదంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గత 21 రోజులుగా మహేశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారింది. ఆమె మృతదేహాన్ని సోమవారం ఉదయపూర్‌ కు తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇక గత వారం, COVID-19 పాజిటివ్ గా తేలి ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news