అమెరికాలో హైదరాబాద్ యువకుడు అనుమానాస్పద మృతి

-

అమెరికాలో హైదరాబాద్ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ యువకుడు నిద్రలోనే కన్నుమూసినట్టు సమాచారం అందుతోంది. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులకు అమెరికా అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే పోస్టుమార్టంలో యువకుడి మృతికి కారణాలు తెలియలేదు. మరింత లోతుగా పరిశీలించాలని వైద్యులు పేర్కొనడంతో అమెరికాలోని ఆసుపత్రిలోనే మృతదేహం ఉండిపోయింది.

శవ పరీక్షలకు ఆర్నెళ్లు సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. మృతదేహం కోసం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల నిరీక్షిస్తున్నారు.  మృతదేహాన్ని వెంటనే భారత్ రప్పించాలని విజ్ఞప్తి  విదేశాంగ మంత్రిని, తెలంగాణా మంత్రి కేటీఆర్ ని సాయం కోరారు కుటుంబ సభ్యులు. కొడుకు మృతదేహం ఎప్పుడు వస్తుందో తెలియక తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  మృతుడికి భార్య, ఐదేళ్ల కొడుకు ఉన్నారని అంటున్నారు. అయితే భార్య, కొడుకు  హైదరాబాద్‌లోనే ఉన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news