సోనియాకి జగ్గారెడ్డి లేఖ.. జాగ్రత్తగా ఉండండి !

-

పీసీసీ అధ్యక్ష పదవి పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇబ్బందిరకరంగా ఉందని అంటూ సోనియా ,రాహుల్ గాంధీలకు  జగ్గారెడ్డి లేఖ రాశారు. ఇప్పుడు కాంగ్రెస్ కు కావాల్సింది పులుల ,సింహాలు కాదని, అందరినీ కలుపుకొని పార్టీకి  విదేయులుగా ఉండే నాయకత్వం  కావాలని పేర్కొంటూ ఆయన లేఖ రాసారు. పార్టీ బలోపేతానికి 25మంది తో కమిటీ వేస్తే బాగుంటుందన్న అయన బలమైన నాయకులను ఎంపిక చేసి ఓక్కోక్కరికి 5 నియోజకవర్గాలు గెలిపించే బాధ్యత అప్పగించండని కోరారు.

రైతులు ,నిరుద్యోగులు‌ ,మహిళలు ,మైనారిటీ ,ఎస్సీ ,ఎస్టీ ల  సమస్యల పై పోరాడేందుకు విడి విడిగా కమిటీ లు వేయండి..వారిని సమన్వయం చేసే బాధ్యత పీసీసీకి అప్పగించమని కోరారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో పీసీసీ ఎంపిక నిర్ణయం వాయిదా వేయండని కోరారు. ఈ ప్రతిపాదనలో నాకు ఎలాంటి స్వార్థం లేదన్న ఆయన సాగర్ లో కాంగ్రెస్ గెలవాలన్నదే నా బలమైన ఆకాంక్ష అని అన్నారు. నేను పరిమితి దాటి మాట్లాడితే క్షమించమని లేఖలో కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news