ఏకంగా 36శాతం తగ్గిన వినియోగం… వాట్సాప్ కథ కంచికేనా?

-

వాట్సప్ ప్రైవసీ పాలసీ మారుస్తున్నామని చెప్పినప్పటి నుండి వాట్సప్ యాల్ అన్ ఇన్స్టాల్స్ రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ప్రైవసీ పాలసీని మారుస్తూ, పేరెంట్ కంపెనీ అయిన ఫేస్ బుక్ తో వాట్సాప్ డేటాని పంచుకుంటామని తెలియజేయడంతో యూజర్లందరూ వాట్సప్ నుండి వైదొలుగుతున్నారు. దాంతో టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ లకి గిరాకీ బాగా పెరుగుతుంది. రానున్న్న రోజుల్లో 18శాతం మాత్రమే వాట్సాప్ ని కంటిన్యూ చేస్తారని, 15శాతం మంది పూర్తిగా మానేసారని, పూర్తిగా 36శాతం వాడకం తగ్గిందని లోకల్ సర్కిల్స్ చేసిన సర్వేలో వెల్లడైంది.

మొత్తం 8977మందిపై చేసిన ఈ సర్వేలో ఈ విషయాలు బహిర్గతం అయ్యాయి. 2బిలియన్లకి పైగా వాట్సాప్ యూజర్లున్న ప్రపంచానికి, ఫేస్ బుక్ యాజమాన్యం, వాట్సాప్ ప్రైవసీ పాలసీని మారుస్తున్నామని, కాంటాక్ట్స్ ని ఫేస్ బుక్ తో పంచుకుంటామని ఫిబ్రవరి 8వ తేదీ నుండి అమల్లోకి రానుందని తెలిపింది. ఈ ప్రకటకపై తీవ్ర విమర్శలు రావడంతో వాట్సాప్ వెనక్కి తగ్గి 202మే 15వ తేదీ వరకు అలాంటి ఆలోచన లేదని విరమించుకుంది.

ప్రస్తుతం స్టార్ట్ అప్ కంపెనీస్ అన్నీ సిగ్నల్ యాప్ పై ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ మేరకు వాట్సాప్ యాజమాన్యం, ప్రైవసీ గురించి చెబుతూ, మీకెలాంటి ఇబ్బంది ఉండదని, మీరు చేసిన చాట్స్, మీ ఫ్రెండ్స్ చేసిన చాట్స్ కి భద్రత ఉంటుందని తెలుపుతుంది. మీరు షేర్ చేసిన లోకేషన్ కూడా సురక్షితంగా ఉంటుందని చెబుతున్నప్పటికీ, 67శాతం యూజర్లు వాట్సాప్ ని విడిచే పనిలో ఉన్నారు. ముఖ్యంగా వాట్సాప్ బిజినెస్ అకౌంట్లు వాడకూడదని నిర్ణయం తీసుకుంటున్నారు. ట్రాన్సాక్షన్ సహా ఇతర పర్సనల్ డేటా ఫేస్ బుక్ కి వెళ్ళిపోతుందన్న ఉద్దేశ్యంతో వాట్సాప్ వినియోగం తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news