సచిన్ ట్వీట్లకి కౌంటర్ వేసిన శరద్ పవార్.. క్రికెట్ తప్ప వేరే మాట్లాడొద్దంటూ..

-

వ్యవసాయ చట్టాలపై రతులు చేస్తున్న నిరసనలపై అటు ఫారెన్ సెలెబ్రిటీల నుండి మద్దతు వస్తున్న నేపథ్యంలో చాలా మంది భారతదేశ అంతర్గత వ్యవహారాలపైన ఇతర దేశాలవారు కామెంట్లు చేయడం సరికాద్ని చెబుతున్నారు. క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా పాప్ సింగర్ రిహన్నా ట్వీట్లకి అదే విధంగా స్పందించాడు. ఐతే తాజాగా సచిన్ వ్యాఖ్యలపై ఎన్ సీ పీ లీడర్ కామెంట్లు చేసాడు. శరద్ పవార్ మాట్లాడుతూ, క్రికెట్ గురించి తప్ప మరో విషయం గురించి మాట్లాడొద్దంటూ అన్నాడు.

ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వ్యవసాయ చట్టలపై రైతులు చేస్తున్న నిరసనలు, నడుపుతున్న ఉద్యమం కొత్త మలుపు తీసుకోనుంది. అటు రైతు సంఘాలు ట్రాక్టర్ల ర్యాలీని పెద్ద మొత్తంలో నిర్వహిస్తామని చెబుతుండగా, ఇటు ఫారెన్ సెలెబ్రిటీలు రైతు సంఘాలని మద్దతు పలకడం కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినట్టుగా అవుతుంది. మరి కేంద్రప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news