బిగ్ బ్రేకింగ్: రఘురామ కృష్ణం రాజుకి ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరిక్షలు…?

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయంలో విచారణ సందర్భంగా సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. రఘురామ కృష్ణం రాజుకి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరిక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది అంటూ వార్తలు వస్తున్నాయి. అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకున్న తర్వాత తుది ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది.

రఘురామ కృష్ణం రాజుపై థర్డ్ డిగ్రీ జరిగింది అంటూ కూడా ఆయన తరుపు న్యాయవాదులు సుప్రీం కోర్ట్ లో వాదనలు వినిపించారు. ఆదినారాయణ రావు, ముకుల్ రోహాత్గీ దీనికి సంబంధించి వాదనలు వినిపించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ కేసు విచారణను వాయిదా వేసింది కోర్ట్. వెకేషన్ బెంచ్ ముందు విచారణ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news