గుజరాత్‌లో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి

-

గుజరాత్: బుధవారం తెల్లవారేసరికే తారాపూర్ రోడ్డు రక్తసిక్తమైంది. కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. ఆనంద్ జిల్లా తారాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన 10 మంది చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ట్రక్కు వేగమే కారణమని ప్రాథమిక అంచనా వేశారు. భారీ శబ్ధంతో కారును ట్రక్కు ఢీకొట్టడంతో ప్రయాణికులు ఎగిరి చెల్లాచెదురుగా పడిపోయారు. మొత్తం పది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నారా అనే కోణంలో కేసు విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. ట్రక్కు, కారును రోడ్డు పక్కకు తీసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news