గాడిదకు గంధం వాసన తెలుస్తుందా ? వైసీపీపై లోకేష్‌ ఫైర్‌

-

కుప్పం ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. గాడిదకు గంధం వాసన తెలియనట్లు .. వైసీపీ వాళ్ళకు చంద్రన్న గొప్పతనం తెలియట్లేదని ఎద్దేవా చేశారు లోకేష్‌. వాళ్ళకు పసుపు జెండా చూడగానే ఎందుకంత భయం..? గతంలో ఎప్పుడైనా ఇంత అరాచకాలను చూశారా..? దేవాలయంలా ఉన్న కుప్పంను చెడగొట్టిన దౌర్భగ్యం వైసీపీ వారిదని నిప్పులు చెరిగారు.

కుప్పంలో అభివృద్ది చేసింది టీడీపీ పార్టీ అని… గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టామన్నారు లోకేష్‌. ఇప్పుడు ఉన్న మంత్రి ఒక్కరూపాయైనా ఇచ్చాడా.. ? ఈ ముఖ్యమంత్రి నోట కుప్పం మాట కనీసం సమీక్షలో వచ్చిందా..? అని నిప్పులు చెరిగారు. కుప్పంలో ఎప్పుడూ చూడనంత మంది పోలీసులు వచ్చారని… 14 జీపులు.. వేసుకుని వచ్చారు.. పోలీసులకు అడ్డు పెట్టుకుని ఆటలాడుతున్నారని వైసీపీ పై ఫైర్‌ అయ్యారు. రంగులు మార్చారు.. ఫోటోలు మార్చారు.. వాళ్ళ నాన్న పోటో పెట్టుకున్నారని జగన్‌ పై మండిపడ్డారు లోకేష్‌. కుప్పం నుండే వైసీపీ పతనానికి నాంది పలకాలని పిలుపు నిచ్చారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news