జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా బలగాలు

-

జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు మరో విజయం లభించింది. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. దక్షిణ కాశ్మీర్ జిల్లా అవంతిపోరాలోని బరాగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు.. ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ టెర్రరిస్ట్ హతమయ్యాడని అధికారులు తెలిపారు. మరణించిన ఉగ్రవాదిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఉగ్రవాదుల ఉన్నట్లు వచ్చిన పక్కా సమచారంతో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాది కాల్పులు జరిపాడు. దీంతో భద్రతా బలగాలు జరిపిన ప్రతిదాడిలో టెర్రరిస్ట్ ను మట్టుబెట్టారు. ఘటన జరిగిన ప్రదేశంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

రెండు రోజుల క్రితం ఉగ్రవాదుల దాడిలో  ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. దీని తర్వాత తాజా ఎన్ కౌంటర్ చోెటు చేసుకుంది.  ఇటీవల కాలంలో జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల కార్యకలాపాలు మెల్లిగా పెరుగుతుండటంతో పోలీసులు, భద్రతా బలగాలు కూడా అప్రమత్తంగా ఉంటున్నాయి. పక్కాసమాచారంతో కూంబింగ్, కార్డన్ సెర్చ్ చేస్తున్న సమయంలో ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీసులు, సీఆర్ఫీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news