టీడీపీలో విషాదం..దెందులూరు మాజీ ఎమ్మెల్యే మృతి

-

తెలుగు దేశం పార్టీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే, తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకులు గారపాటి సాంబశివరావు మృతి చెందారు. 80 సంవత్సరాలు ఉన్న గారపాటి సాంబశివరావు… పెదపాడు మండలం నాయుడు గూడెంలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

తెలుగు దేశం పార్టీ హయాంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి మంత్రి గా గారపాటి సాంబశివరావు పని చేశారు. అయితే.. 2019 ఎన్నికల్లో మాత్రం.. వైసీపీ పార్టీ అభ్యర్థి చేతిలో స్వల్ప మేజార్టీతో ఓటమి పాలయ్యారు. ఇక గారపాటి సాంబశివరావు మృతి పట్లు పలువురు తెలుగు దేశం పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు.

ఇక సీనియర్‌ నాయకులు గారపాటి సాంబశివరావు మృతి నారా లోకేష్‌ సంతాపం తెలిపారు. దెందూలూరు నియోజ‌క‌వ‌ర్గంలో అందరికీ ఆప్తులుగా ఉంటూ, ప్రజా రాజకీయాలలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ముంగమూరు గారపాటి సాంబశివరావు మరణం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అంటూ పేర్కొన్నారు లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news