తెలంగాణ‌లో నేడు కొత్త‌గా 35 క‌రోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య నేడు స్వ‌ల్పంగా పెరిగింది. గ‌త కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతుంది. అయితే నిన్న‌టితో పోలిస్తే.. ఈ రోజు క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. ఈ రోజు క‌రోనా వైర‌స్ బులిటెన్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఈ కరోనా బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో తెల‌గాణ రాష్ట్రంలో 35 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

కాగ రాష్ట్రంలో నేడు క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య‌.. 248 గా ఉంది. కాగ గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. 16,610 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. దీనిలో 459 క‌రోనా శాంపిల్స్ ఫ‌లితాలు రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news