విజయవాడకు గుడ్ న్యూస్… మే 3నుంచి ఢిల్లీకి నేరుగా ఫ్లైట్

-

విజయవాడ వాసులుకు గుడ్ న్యూస్ ఇకపై ఢిల్లీ వెళ్లాలనుకునే వారు నేరుగా విజయవాడ నుంచి వెళ్లే అవకాశం లభించనుంది. పలు కారణాల వల్ల గత రెండు నెలలుగా నిలిచిపోయిన విజయవాడ- ఢిల్లీ ఏయిరిండియా విమానం పున: ప్రారంభం కానుంది. మే 3 నుంచి ఢిల్లీకి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇన్నాళ్లు ఢిల్లీకి వెళ్లాలనుకునే విజయవాడ వాసులు హైదారాబాద్ లేకపోతే వైజాగ్ నుంచి వెళ్లాల్సి వచ్చేంది. ప్రస్తుతం ఈ బాధలు తీరనున్నాయి.ప్రతీ మంగళవారం, బుధ, గురు, శుక్రవారాల్లో ఢిల్లీ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి 8.35కు విజయవాడ చేరుతుంది. అలాగే 9.15 కు విజయవాడ నుంచి బయలు దేరి 11.30గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. జూన్ నుంచి ప్రతీ రోజు ఈ సర్వీసుల తిరుగనున్నాయి. ప్రస్తుతం విజయవాడ నుంచి అలయన్స్ ఏయిర్ బెంగళూర్, హైదరాబాద్ కు సర్వీసులు నడుపుతోంది. ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ బెంగళూర్, చెన్నై, హైదరాబాద్, తిరుపతి, కడప, వైజాగ్ సిటీలకు సర్వీసులను నడుపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news