చంద్రబాబు, లోకేష్ లు చీరలు కట్టుకోవాలి… మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

-

కొడుకును ఎమ్మెల్యేలుగా గెలిపించుకోలేని చంద్రబాబు, ఎమ్మెల్యేగా గెలవని లోకేష్ లు చీరలు కట్టుకోవాలని ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చీర కావాలో, చుడీదార్ కావాలో టీడీపీ నేతలే తేల్చుకోవాలంటూ విమర్శించారు. మహిళల కోసం వైఎస్సార్సీపీ, సీఎం జగన్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని రోజా అన్నారు. టీడీపీ మహిళా ద్రోహుల పార్టీ అని… అందరి కన్నా పెద్ద ఉన్మాది చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తింది. టీడీపీలో ఉన్నంత మంది ఉన్మాదులు దేశంలో ఏ రాజకీయ పార్టీలో లేరంటూ వ్యాఖ్యానించారు. దమ్ము గురించి టీడీపీ మాట్లాడుతోందని… 12 ఏళ్లుగా జగన్ దమ్మెంటో చూస్తున్నారు కదా.. ఒక్క ఎమ్మెల్యేగా మొదలై 151 ఎమ్మెల్యేలకు చేరిన దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మహిళ అందరి ఆశీస్సులతో లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీని వైసీపీ దారుణంగా ఓడించిందని.. కుప్పంలో కూడా మీరు ఓడిపోయారని గుర్తు చేశారు. ఒంటరిగా పోరాటం చేయలేని పార్టీ టీడీపీ అని.. ఎవరితో పొత్తులు పెట్టుకుందామా అని చూసే పార్టీ టీడీపీ అని విమర్శించారు రోజా. చంద్రబాాబు నాయుడు పిల్లనిచ్చిన మామా దగ్గర నుంచి ఓటేసిన ప్రజల వరకు అందర్ని మోసం చేశారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news