కేసీఆర్ కు పేరు, ప్రతిష్ట, డబ్బే కావాలి… ప్రజా సమస్యలు పట్టవు: బండి సంజయ్

-

కేసీఆర్ కు కావాల్సింది పేరు, ప్రతిష్ట, డబ్బులు కావాలి, ఓట్లు, సీట్లను కొనుక్కోవడం ముఖ్యమని… ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు విమర్శించారు. దివ్యాంగులను గుర్తించి వాళ్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు ఇప్పించే బాధ్యత నాదని ఆయన అన్నారు. 1 లక్షా 40 వేల మందికి ఇళ్లు కట్టించానని చెబుతున్నారని.. కేంద్రం  సమాచారం అడిగితే ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. బీజేపీ అంటేనే కేసీఆర్ వణుకుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రజలకు ఏం ఇవ్వడని… కేసీఆర్ ప్రభుత్వం మారాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీకి ఓటేయకున్నా కూడా తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులకు కేసీఆర్ జీతాలే ఇవ్వడం లేదని.. ప్రతీ వ్యక్తి మీద లక్ష రూపాయల అప్పుల భారాన్ని మోపాడని విమర్శించారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలవనని తెలిసి అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. దివ్యాంగుల వెనక బీజేపీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news