పెళ్లి చేసుకుంటానని శృంగారం.. 14 సార్లు అబార్షన్‌

-

తమ కామవాంఛ తీర్చుకోవడానికి మహిళలను మోసం చేయడానికి పెళ్లి పేరును అడ్డంగా పెట్టుకుంటున్నారు కొందరు. తీరా శారీరక వాంఛ తీర్చికున్నాక ముఖం చాటేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఢిల్లీలోని జైట్‌పూర్‌లో చోటు చేసుకుంది. 33 ఏళ్ల బాధిత మహిళ 9 సంవత్సరాల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. బీహార్‌కు చెందిన నిందితుడు గౌతమ్ ఆమెతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఇద్దరూ కలిసి సహజీవనం కొనసాగించారు. ఈ క్రమంలో ఈ 8 సంవత్సరాల్లో 14సార్లు ఆమెకు అబార్షన్ చేయించాడు. అయినప్పటికీ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు గౌతమ్‌. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఈ నెల 5న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కానీ ఆఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గౌతమ్ చేసిన తప్పులకు సంబంధించిన ఆధారాలు సేకరించానని, తన ఫోన్‌ను చెక్ చేయాలని కోరింది. నోయిడాలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న నిందితుడిపై ఆత్మహత్యకు ప్రేరేపించడం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు, ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న బాధితురాలి భర్తను పిలిపించి పోలీసులు ప్రశ్నించారు. తామిద్దరం దాదాపు 8 ఏళ్ల నుంచి విడిగా ఉంటున్నట్టు ఆయన చెప్పాడని పోలీసులు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news