కుప్పంలో ‘ఫ్యాన్’ మాయ..బాబుకు టెన్షన్?

-

చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ వదిలేలా లేదు…ఏదొక విధంగా అక్కడ బలం పుంజుకుని, వచ్చే ఎన్నికల్లో బాబుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంలో బాబు బలం తగ్గించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.

ఇదే క్రమంలో అధికార బలంతో చాలావరకు కుప్పంలో పట్టు సాధించారు…పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించారు. ఈ ఎన్నికలతో చంద్రబాబులో టెన్షన్ మొదలైంది..వైసీపీ బలం పెరుగుతుందనే భావన ఆయనలో కనిపించింది. అందుకే పెద్దగా కుప్పాన్ని పట్టించికోని బాబు…ఇప్పుడు పదే పదే కుప్పం టూరుకు వెళుతున్నారు. అలాగే ఇప్పుడు అక్కడ పర్మినెంట్ గా ఇల్లు కూడా కట్టుకుంటున్నారు.

అసలు సాధారణ ఎన్నికల్లో కనీసం ప్రచారానికి వెళ్లకుండా కుప్పంలో సత్తా చాటే చంద్రబాబుని ఏకంగా అక్కడే ఇల్లు కట్టుకునేలా చేసింది వైసీపీ. అంటే బాబుని బాగానే టెన్షన్ పెడుతున్నారు. ఇక బాబుకు మరింత టెన్షన్ పెంచేలా వైసీపీ కార్యక్రమాలు ఉంటున్నాయి. కుప్పంలో వలసలని గట్టిగా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే టీడీపీలో ఉండే ద్వితీయ శ్రేణి నాయకులని చాలావరకు వైసీపీలోకి లాగారు.అలాగే కింది స్థాయిలో ఉండే కార్యకర్తలని కూడా వైసీపీలోకి తీసుకొస్తున్నారు. పైగా టీడీపీ గుర్తింపు కార్డులు చూపించి మరీ వైసీపీలో చేర్చుకుంటున్నారు.

అయితే ఇందులో కూడా వైసీపీ మాయ కాస్త ఉందని తెలుస్తోంది…ఇటీవల నియోజకవర్గ ఇంచార్జ్ భరత్…కొందరు టీడీపీ కార్యకర్తలని పెద్దిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేర్చారు. అప్పుడు పెద్దిరెడ్డి…వారిని టీడీపీ గుర్తింపు కార్డులు చూపించమనగా, అందరూ కార్డులు చూపించారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… టీడీపీ గుర్తింపు కార్డులు చూపించిన వారిని ఆరాతీస్తే.. గుర్తింపు కార్డులో ఉన్న ఫొటోకు వారికి అసలు సంబంధమే లేదన్న విషయం స్పష్టంగా తెలిసింది. అంటే ఫేక్ అని అర్ధమైంది. ఇక ఇదంతా చంద్రబాబులో టెన్షన్ పెంచడానికే వైసీపీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు వైసీపీ ఏం చేసిన గాని బాబుకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఏదొకవిధంగా కుప్పంలో బాబుకు చెక్ పెట్టాలని వైసీపీ ఎత్తులు వేస్తూనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news