ఉండవల్లి అరుణ్ కుమార్ పై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

-

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పై సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ప్రత్తిపాడు లో నటుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ.. ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్ భజన చేస్తున్నారని ఆరోపించారు. టిడిపి హయంలో మద్యం అమ్మకాలపై ఉండవల్లి విమర్శలు చేశారని.. మద్యం ధర ఎంత ఉందో అప్పుడు చూపించారని, మరి ఇప్పుడున్న మద్యం ధరపై ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు.

ఏపీని అప్పుల పాలు చేసిన సీఎం జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైసిపి పాలనలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని అన్నారు నటుడు శివాజీ.

Read more RELATED
Recommended to you

Latest news