మహిళలకు శుభవార్త.. రొమ్ము క్యాన్సర్ కు చెక్ పెట్టే అద్భుతమైన ఆహారం ఇదే..!!

-

ఈ మధ్యకాలంలో ఎక్కువగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అనేది చాలా ప్రాణాంతకంగా మారిపోయింది. ఇక ఋతుక్రమం ఆగిన తర్వాత రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు సైతం సూచిస్తున్నారు. సగటున 51 మంది రుతుక్రమం ఆగిన మహిళల్లో 8 సంవత్సరాల పాటు అధ్యయనం జరగగా వారికి రొమ్ము క్యాన్సర్ లక్షణాలను తగ్గించే అద్భుతమైన ఆహారం అత్తిపండ్లు అని తేలింది. ముఖ్యంగా అత్తి పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ రొమ్ము క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడి రక్షణగా నిలుస్తుందట. ఇక తరచూ అత్తి పండ్లు తినని వారి కంటే తినేవారిలోనే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం 34 శాతం తగ్గిందని అధ్యయనాలు వెల్లడించాయి. ఆపిల్, డేట్స్, అత్తి పండ్లు , బేరి మరియు ప్రూనే వంటి పండ్లల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల ఆడవాళ్లలో వచ్చే రొమ్ము క్యాన్సర్ ను నివారించవచ్చు.

ఇకపోతే అత్తిపండ్లు మధుమేహంతో బాధపడుతున్న వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. అత్తి చెట్టు యొక్క ఆకులు ఎక్కువగా ఫైబర్ ను నిండి ఉంటాయి. ఇక ఇన్సూలిన్ సూది మందు తీసుకునే మధుమేహ వ్యాధిగ్రస్తులకు అవసరమైన ఇన్సులిన్ మొత్తం తగ్గించగల యాంటీబయోటిక్ లక్షణాలు కూడా అత్తిపండ్ల ఆకులలో కలిగి ఉంటాయి . కాబట్టి మధుమేహం తగ్గించడానికి ఇన్సులిన్ ఇంజక్షన్ తగ్గించడానికి అత్తి పండ్ల ఆకుల నుంచి తయారు చేసిన రసాన్ని అల్పాహారంలో తీసుకోవడం వల్ల ఇంజక్షన్ తో పని ఉండదు.

అంతేకాదు జీర్ణ వ్యవస్థ పనితీరుకు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇక అంతేకాదు మూలశంక వ్యాధితో బాధపడే వారు కూడా ఈ పండ్లను రోజూ తీసుకుంటే మరింత సమస్య తొలగిపోతుంది.ముఖ్యంగా మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పండ్లకు దూరంగా ఉంటే మంచిది. ఇక అధిక సోడియం.. తక్కువ పొటాషియం తీసుకోవడం వల్ల రక్తపోటుకు దారి తీయవచ్చు. కాబట్టి పొటాషియం సమృద్ధిగా ఉండే అత్తి పండ్లు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ దూరమవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news