ఇవాళ నారా లోకేశ్ ఇలాకాలో సీఎం జగన్ పర్యటన

-

నేడు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ, మంగళగిరిలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి షెడ్యూల్‌ ను విడుదల చేసింది. ఇందులో భాగంగానే… ఇవాళ ఉదయం 8.47 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 8.57 గంటలకు విజయవాడ చేరుకోనున్న సీఎం జగన్‌… 9.00 –10.30 గంటల వరకు సూర్యారావు పేటలో నూతనంగా నిర్మించిన జిల్లా కోర్టు భవన సముదాయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

ఇక ఇవాళ ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి తిరుగు పయనం…12.55 గంటలకు తాడేపల్లి మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌కు సీఎం వెళతారు. మధ్యాహ్నం 1.10 – 2.00 గంటల వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ల గౌరవార్ధం రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం జగన్. అనంతరం 2.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news