ప్రియురాలిని చంపి.. పెరట్లో పూడ్చిపెట్టి పరారైన వ్యక్తి

-

పెళ్లై పిల్లలున్న ఓ వివాహితతో.. వివాహితుడు సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరు కలిసి కొన్నిరోజులుగా సహజీవనం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆ మహిళ కొన్ని రోజుల నుంచి ఫోన్​కాల్స్ లిఫ్టు చేయడం లేదు. తమ కూతురు ఏమైందని ఆ వ్యక్తిని మహిళ తండ్రి ప్రశ్నించగా దురుసుగా సమాధానమిచ్చాడు. అనుమానమొచ్చిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. వారు సహజీవనం ఉంటున్న ఇంటి పెరట్లో ఆ మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని రాయగఢ్​లో చోటుచేసుకుంది.

కానిస్టేబుల్-దారుణ హత్య
కానిస్టేబుల్-దారుణ హత్య

నిందితుడు ఖగేశ్వర్‌, బాధితురాలు కాంతి యాదవ్‌లు కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికీ అంతకుముందే వేర్వేరుగా పెళ్లిలు జరిగాయి. కానీ ఇద్దరూ తమ కుటుంబాల్ని విడిచిపెట్టి సహజీవనం సాగిస్తున్నారు. కాంతికి ఇద్దరు కుమారులు కాగా.. ఖగేశ్వర్‌కు నలుగురు పిల్లలు.

ఖగేశ్వర్.. భార్య, పిల్లల్ని జశ్​పుర్​లో విడిచిపెట్టి వచ్చి.. 2018 నుంచి కాంతితో కలిసి జీవిస్తున్నాడు.బాధితురాలి ఫోన్ 17 రోజులుగా స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో ఆమె ప్రియుడు ఖగేశ్వర్​పై బాధితురాలి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. కంకూరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖగేశ్వర్​ను.. బాధితురాలి తండ్రి తన కుమార్తె గురించి ప్రశ్నించాడు. అతడు దురుసుగా సమాధానం చెప్పేసరికి బాధితురాలి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఈ విషయం బాధితురాలి అక్కకు తెలిసింది. దీంతో ఆమె నిందితుడి ఇంటికి వెళ్లేసరికి అసలు విషయం బయటపడింది.

Read more RELATED
Recommended to you

Latest news