ఆన్‌లైన్ గేమింగ్‌ నిషేధంపై ఆర్డినెన్సులు జారీ!

-

ఆన్‌లైన్ గేమింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ గేమ్‌లపై నిషేధం విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్సులపై గవర్నర్ ఆర్ఎస్.రవి ఆమోదం కూడా తెలిపారు. ఆన్‌లైన్ గేమ్స్ వల్ల చాలా మంది డబ్బులు కోల్పోవడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ గేమ్స్ లను నిషేధిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆన్‌లైన్ గేమింగ్
ఆన్‌లైన్ గేమింగ్

ఆర్డినెన్సులపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో అక్టోబర్ 1వ తేదీన ఈ ఫైల్ రాజ్‌భవన్‌కు చేరుకుంది. దీనిపై ఆమోదం తెలపడంతో ఆల్‌ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్) నిరసన వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వానికి మరోసారి ఆర్డినెన్సును పునఃపరిశీలించాలని కోరింది. అయితే ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మద్రాసు హైకోర్టు పేర్కొంది. మూడేళ్లు జైలు శిక్షతోపాటు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news