తెలంగాణ బీజేపీ నాయకులకు అధిష్టానం బిగ్‌ షాక్‌..

-

తెలంగాణ బీజేపీ నాయకులకు అధిష్టానం బిగ్‌ షాక్‌ తగిలింది. కొత్తగా నియమించిన అసెంబ్లీ ఇంఛార్జిలతో బండి సంజయ్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ తాజాగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఇంఛార్జి లు చేయాల్సిన పనుల పై దిశా నిర్దేశం చేశారు సునీల్ బన్సల్. బూత్ కమిటీలు వేయాలని.. నెలలో నాలుగు రోజులు తమకు కేటాయించిన అసెంబ్లీ లో పర్యటించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

శక్తి కేంద్రాలకు ప్రముఖ్ లతో పాటు… ఆ శక్తి కేంద్రం తో సంబంధం లేని వారిని ఇంఛార్జి లుగా నియమించాలి…అసెంబ్లీ ఇంఛార్జి లు ఎన్నికల్లో పోటీ చేయొద్దన్నారు బన్సల్. అయితే.. బన్సల్ మాటలతో ఇబ్బంది పడ్డ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు నేతలు. దీనిపై కలగ చేసుకున్న బండి సంజయ్.. 6 నెల లు ఇంఛార్జిలుగా పని చేయండి… అన్ని పనులు పూర్తి చేయండని వెల్లడించారు.ఆ తర్వాత మిమ్మల్ని ఇంఛార్జి లుగా తప్పిస్తమని చెప్పారు బండి సంజయ్. దీంతో ఊపిరి పీల్చుకున్నారు ఆశావహులు.

Read more RELATED
Recommended to you

Latest news