చైన్నైలో యువతిని రైలునుంచి తోసేసిన ప్రేమోన్మాది అరెస్ట్‌

-

తమిళనాడులోని చెన్నైలో ఓ ప్రేమోన్మాది తన ప్రేమను యువతి నిరాకరించిందని కదులుతున్న రైలు నుంచి తోసేసి హతమార్చిన ఘటన కలకలం రేపుతోంది. అయితే.. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. అదంబాక్కానికి చెందిన సత్య (20) టీనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం సెకండియర్ చదువుతోంది. అదంబాక్కానికే చెందిన సతీశ్ (23) ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడేవాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. తన ప్రేమను నిరాకరించిన ఆమెపై సతీశ్ కోపం పెంచుకున్నాడు.
ఈ క్రమంలో గురువారం సత్య కళాశాలకు వెళ్లేందుకు సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలు కోసం ఎదురుచూస్తోంది.

Girl killed by being pushed in front of train at Chennai Parangimalai  railway station; A police officer's son was attacked IG News | IG News

అదే సమయంలో అక్కడికి చేరుకున్న సతీశ్ తన ప్రేమ విషయంలో ఆమెతో అక్కడే వాదులాటకు దిగాడు. అయినప్పటికీ ఆమె ససేమిరా అనడంతో ఆగ్రహంతో ఊగిపోతూ ప్లాట్‌పామ్ నుంచి రైలు పట్టాలపైకి ఆమెను తోసేశాడు. అదే సమయంలో తాంబరం నుంచి వస్తున్న రైలు ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో సత్య అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సీరియస్ అయ్యారు. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. ఏడు బృందాలుగా విడిపోయి నిందితుడిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news