కేంద్రాన్ని కదిలిస్తా అన్న జగన్.. మోదీకి మసాజ్ చేస్తున్నారు : కేఏ పాల్

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ విజయవాడలో అంబేడ్కర్ విగ్రహానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీలో శాంతి భద్రతలు గాడి తప్పాయని అన్నారు. పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వదిలి పోతున్నారని, లక్షల కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కడికి వెళ్లినా ఉద్యోగులు,రిటైర్డ్ ఉద్యోగులు,అన్ని వర్గాల ప్రజలు జగన్​కు ఓటు వేస్తే “బుద్ధి వచ్చింది !” అని బాధ పడుతున్నారని కేఏ పాల్ అన్నారు. అవినీతి కేసు​ల నుంచి బయటపడడానికి జగన్ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆరోపించారు. జగన్​కు 25 ఎంపీలు ఇస్తే కేంద్రాన్ని కదిలిస్తా అన్నారు ,ఇప్పుడు మోదీకి మసాజ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news