హైదరాబాద్ నుండి టూర్.. రూ.3,100 కి షిరిడీ, ఎల్లోరా చూసి వచ్చేయచ్చు..!

-

షిరిడీ వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మీకు తెలంగాణ టూరిజం నుండి ఓ గుడ్ న్యూస్. తక్కువ ధరకే షిరిడీ టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా షిరిడీ తో పాటు సమీపంలో వున్న ఎల్లోరా, శనిశింగ్నాపూర్, గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని కూడా చూసి వచ్చేయచ్చు. ఇక ఈ టూర్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. రూ.3,110 ధరకే ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటోంది.

ఔరంగాబాద్‌ లోని మినీ తాజ్‌మహల్ కి వెళ్లి రావచ్చు. తక్కువ ధరకే ఇవన్నీ చూసేందుకు అవుతుంది. ప్రతీ బుధవారం, శుక్రవారం ఈ టూర్ అందుబాటులోనే ఉంటుంది. ఎప్పటి నుండో షిరిడీ వెళ్లాలని అనుకునే వాళ్ళు ధర తక్కువే కనుక ఈ టూర్ ని బుక్ చేసుకోవచ్చు. మూడు రోజుల పాటు షిరిడీ మరియు మిగిలిన ప్రదేశాలని చూసి వచ్చేయచ్చు. అలానే తెలంగాణ టూరిజం తీసుకు వచ్చిన ఈ ప్యాకేజీ లో ఎల్లోరా కూడా వుంది. మొదటి రోజు హైదరాబాద్‌లో ఈ టూర్ స్టార్ట్ అవుతుంది.

తెలంగాణ టూరిజం బస్సు ఎక్కాలి. రెండో రోజు శనిశింగ్నాపూర్ చూసేసి.. ఆ తర్వాత షిరిడీ వెళ్ళాలి. హోటల్‌లో చెకిన్ అయ్యాక సాయిబాబా ఆలయాన్ని సందర్శించుకోవాలి. దర్శనం కోసం సొంత ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. మూడో రోజు తెల్లవారుజామున షిరిడీ నుంచి స్టార్ట్ అవ్వాల్సి వుంది. దారిలో ఎల్లోరా గుహలు, గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ఔరంగాబాద్‌లోని మినీ తాజ్‌మహల్ ని చూడొచ్చు.

ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. నాలుగో రోజు ఉదయం హైదరాబాద్ రీచ్ అవుతారు. టూర్ ముగుస్తుంది. షిరిడీ, నాసిక్, త్రయంబకేశ్వర్ టూర్ ప్యాకేజీ ధర రూ.3,100. కేవలం షిరిడీ సాయిబాబా దర్శనం చేసుకోవాలనుకునేవారికి రూ.2400.

 

 

Read more RELATED
Recommended to you

Latest news