యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కథనాయకుడిగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా తెరకెక్కింది. అయితే.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మించగా.. మురళీ కిషోర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కిరణ్ జోడీగా కశ్మీర పరదేశి అలరించనుంది. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి బాణీలను సమకూర్చాడు.
ఇక ఇటీవలే హీరో సాయితేజ్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. హిరోయిన్ తో హీరో లవ్ .. ఆమె తండ్రితో కామెడీ .. విలన్ గ్యాంగ్ తో యాక్షన్ అంశాలు కలగలిసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మరి ఈ సినిమా అయితే ఈ వచ్చే వారం ఫిబ్రవరి 18న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ లాక్ చేశారు. మరి ఈ సినిమా తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అక్కినేని హీరో అఖిల్ హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం.
Our #MostEligibleBachelor @AkhilAkkineni8 is going to grace the grand pre-release of #VinaroBhagyamuVishnuKatha 🤩❤️#AkhilForVBVK 😎#AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @GA2Official @kashmira_9 @KishoreAbburu @chaitanmusic @daniel_viswas @adityamusic #VBVKonFEB18th pic.twitter.com/CcgOpXVPDs
— Geetha Arts (@GeethaArts) February 13, 2023