మళ్లీ పంత్ ను రెచ్చగొడుతున్న ఊర్వశి

-

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు ముంబైలోని కోకిలాబెన్ ధీరుబాయి అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కూడా పంత్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించింది. శనివారం ముంబై ఎయిర్పోర్ట్ లో ఊర్వశి ప్రత్యక్షం కావడంతో ఫోటోగ్రాఫర్స్ ఆమెను చుట్టుముట్టారు.

ఈ సమయంలో పంత్ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఊర్వశి మాట్లాడుతూ, “పంత్ మన దేశానికి పెద్ద ఆస్తి. అతను టీమిండియాకు ఆడడం దేశానికి గర్వకారణం. పంత్ త్వరగా కోలుకోవాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అంటూ పేర్కొంది. గతంలో పంత్, ఊర్వశీ రౌతేలా మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా వీరిద్దరి విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు దృశ్య ఆమె వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news