విశాఖ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ లో నాటుకోడి పెడతాం – మంత్రి గుడివాడ

-

టీడీపీ రాజకీయం కోసం పరిశ్రమల సదస్సులు నిర్వహించిందని.. మేం రాష్ట్ర ప్రజల కోసం సమ్మిట్ నిర్వహిస్తున్నామని చెప్పారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. 2 లక్షల కోట్ల పెట్టుబడుల నుంచి మా టార్గెట్ ప్రారంభం అవుతుందని.. ముఖ్యమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు ఈ రెండు రోజుల్లోనే కాకుండా తర్వాత కూడా కొనసాగుతాయని వివరించారు. వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని.. ఆంధ్ర భోజనం రుచులు చూపించనున్నామన్నారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.

రాయలసీమ రాగి సంకటి, నాటుకోడి, గుంటూరు గోంగూర పచ్చడి వంటి ఆంధ్రా వంటకాలు మెనూలో ఉండనున్నాయని.. భోజన ఏర్పాట్ల పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. చంద్రబాబుకు చేస్తున్న విమర్శలకు హెరిటేజ్ పరిశ్రమ రాష్ట్రంలో లాభదాయకంగా కొనసాగుతూ ఉండటమే సమాధానం అన్నారు. రాష్ట్రౌలో వివిధ రంగాల్లో పారిశ్రామిక, పెట్టుబడి పెట్టే అవకాశాలు వివరించటానికి ఇదే మంచి అవకావం అని వివరించారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.

Read more RELATED
Recommended to you

Latest news