జనసేన ఆవిర్భావం రోజే చర్చిద్దాం.. పవన్ కళ్యాణ్ కు జోగి రమేష్ సవాల్

-

శనివారం బీసీ సదస్సులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్. తాడేపల్లి లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పదేళ్లలో బీసీల కోసం ఏం మాట్లాడాలని ప్రశ్నించారు. అసలు పవన్ భావజాలంలోనే బీసీలు లేరని.. ఆయన వెంటనే బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో సామాజిక న్యాయం పై చర్చకు సిద్ధమా? అంటూ పవన్ కళ్యాణ్ కి సవాల్ విసిరారు.

 

జనసేన ఆవిర్భావ సభ రోజున ఈ అంశంపై చర్చిద్దాం.. దమ్ముంటే చర్చకు రావాలని పవన్ కళ్యాణ్ కి సవాల్ విసిరారు జోగి రమేష్. చంద్రబాబుకు అమ్ముడుపోయిన పవన్ కళ్యాణ్ బీసీల డిక్లరేషన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఒక బానిస అని.. 2014లో చంద్రబాబుతో కలిసి బీసీలకు ఇచ్చిన 125 హామీలలో ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. 175 స్థానాలలో పోటీ చేస్తానని చెప్పలేని చెవటదద్దమ్మలు అంతా కలసికట్టుగా వచ్చిన సీఎం జగన్ ని ఏమీ చేయలేరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news