2024లో పులివెందులలో జగన్ ను ఓడిస్తాం – బుద్ధ వెంకన్న

-

2024లో పులివెందులలో జగన్ ను ఓడిస్తామని హెచ్చరించారు ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న. టిడిపి బలపరచిన పట్టభద్రుల ఎంఎల్సీలు గెలవడంతో బెజవాడలో సంబరాలు నెలకొన్నాయి. ఈ తరుణంలోనే బుద్ధ వెంకన్న మాట్లాడారు. మళ్ళీ వచ్చేది చంద్రబాబు నాయుడేనని… నాని, వంశీ, అవినాష్ టిడిపి భిక్షతో వచ్చిన వాళ్ళు అని విమర్శలు చేశారు.

పట్టభద్రుల MLC లో టిడిపి అభ్యర్ధులను గెలిపించారని… ప్రజల తీర్పుకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. 2024లో వచ్చేది చంద్రబాబే అని దేవుడు స్క్రిప్ట్ రాసాడని.. 14 నెలల ముందే చూపించాడు భగవంతుడు అని తెలిపారు. కుప్పంలో చెత్తకుప్పని కూడా కొట్టలేరు మీరునని… పులివెందుల కొట్టేసాం మేం … 2024లో జగన్ పులివెందుల లో గెలిస్తే చాలు అన్నారు. ఇప్పటికైనా రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని జగన్ కు సవాల్‌ విసిరారు ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న.

Read more RELATED
Recommended to you

Latest news