వచ్చే ఎన్నికల్లో మేమేంటో చూపిస్తాం – చంద్రబాబు

-

శాసనమండలి పట్టభద్ర నియోజకవర్గాలకు నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురు టిడిపి అభ్యర్థులు నేడు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ని కలిశారు. టిడిపి అభ్యర్థులు వేపాడ చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాం భూపాల్ రెడ్డి నేడు చంద్రబాబుని కలిశారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి పని చేయడం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి విజయం సాధించిందని అన్నారు చంద్రబాబు.

ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించిన సమర్థవంతంగా ఎదుర్కొని మూడు ఎమ్మెల్సీ స్థానాలలో విజయం సాధించామని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాదు.. వచ్చే ఎన్నికలలోనూ తామేంటో చూపిస్తామని అన్నారు. విజ్ఞత లేని నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే అసెంబ్లీ సమావేశాలు ఇలాగే జరుగుతాయని, సభ గౌరవాన్ని జగన్ మంటగల్పుతున్నారని ఆరోపించారు. ఇన్ని రోజులు పులివెందుల పులి అనుకుంటున్న వ్యక్తి ఇప్పుడు పిల్లిగా మారాడని పరోక్షంగా సీఎం జగన్ ని ఉద్దేశించి విమర్శించారు. రామ్ భూపాల్ రెడ్డి ఇప్పుడు పులివెందుల పులిగా మారాడని కితాబిచ్చారు. వైయస్ఆర్సీపీ నాయకులను చివరికి పోలీసులు కూడా కాపాడలేరని, బట్టలు విప్పిస్తామని హెచ్చరించారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news