అదిరిందేహే: ఆస్కార్ అవార్డు గెలిచిన మూవీ టీం తో ప్రధాని మోదీ !

-

ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డు వేడుకలలో ఇండియా నుండి ఆర్ ఆర్ ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న మూవీ టీంను ప్రధాని మోదీ కలిశారు. “ఎలిఫెంట్ విస్పరర్స్ ” అనే పేరుతో తీసున్నా డాక్యుమెంటరీ ఎందరో మనసులను కదిలించింది. ఈ మూవీ అంత చక్కగా రావడానికి కారణంగా అయిన డైరెక్టర్ కార్తీక్ మరియు నిర్మాతగా ఉన్న గుణీత్ మోంగాలను మోఢీ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

ఈ డాక్యుమెంటరీ తెరకెక్కించిన విధానం ఎందరో యంగ్ డైరెక్టర్ లకు మరియు ఫిలిం మేకింగ్ ను కెరీర్ గా ఎంచుకునే వాళ్లకు ఆదర్శమని చెప్పాలి. ఇంతటి మూవీ ని ఈ ప్రపంచానికి చూపించి భారతదేశం గర్వపడేలా చేశారని మోదీ కొనియాడారు. ఒక చిన్న డాక్యుమెంటరీ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇంతకన్నా గొప్ప మెప్పు ఏముంటుంది చెప్పండి.

Read more RELATED
Recommended to you

Latest news