BREAKING : బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

-

ప్రధాని నరేంద్ర మోడీ.. హైదరాబాద్‌ కు చేరుకున్నారు. కాసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి.. బీజేపీ నేతలు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళ్‌ సై.. ఆహ్వానించారు. ఈ తరుణంలో… సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్ వద్ద పోలీస్ అలెర్ట్ అయ్యారు. ప్రధాని మోదీ పెరేడ్ గ్రౌండ్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లనున్న రూట్ మ్యాప్ వద్ద పోలీసుల భారీ భద్రత ఏర్పాటు చేశారు. వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అలాగే.. బేగంపేట నుండి పెరేడ్ గ్రౌండ్ మీదుగా సికింద్రాబాద్ రూట్ వైపు ట్రాఫిక్ నిలిపి వేశారు పోలీసులు. బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని మోడీ పర్యటన అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే… కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news