నోట్లో గుడ్డలు కుక్కి మహిళపై అత్యాచారం.. ఆ తరువాత

-

రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అయితే.. అలాంటే ఘటనే ఇది. ఒంటరిగా ఉంటున్న మహిళపై హత్యాచారం, హత్య చేసి బంగారు నగలు, నగదు తీసుకెళ్లిన నిందితులను అరెస్ట్ చేసి.. వారి వివరాలు వివరించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్. వివరాల్లొ్కి వెళితే.. 65 సంవత్సరాల వృద్ధురాలు నిమ్మల ఉమాదేవి చాలా సంవత్సరాల క్రితమే భర్తని వదిలి ఒంటరిగా నివసిస్తున్నదని. అదే గ్రామానికి చెందిన 25 సంవత్సరాల కప్పల విజయ్ సూర్యాపేట లోని బార్ లో వెయిటర్ గా పని చేస్తున్నాడు. మద్యం తాగి ఇతడు పెట్టే బాధలు భరించలేక ఆతని భార్య వెళ్ళిపోయిందని తెలిపారు. ఉమాదేవి గ్రామంలో ఒంటరిగా ఉండటం, ఆమె వద్ద బంగారం, డబ్బు ఉన్నదని గ్రహించి ఎన్నో రోజులుగా గమనించిన విజయ్, ఈ నెల 7వ తేదీన శుక్రవారం రోజు రాత్రి గ్రామంలో బలగం సినిమా ప్రదర్శిస్తుండటం, గ్రామస్తులందరు అక్కడ ఉండటం గమనించిన విజయ్ ఫుల్ గా మద్యం సేవించి అతని మిత్రుడు ఖలేoదర్ ను ఇంటి బయట ఉంచి, ఉమాదేవి ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి నిద్రిస్తున్న ఉమాదేవి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడని తెలిపారు.

Delhi Police takes note of complaint over rape murder threat on social  media against Muslim women - The Week

ప్రతిఘటించిన ఉమదేవిని విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె చనిపోయిoది. ఆ తర్వాత ఆమె సూట్ కేసు పగల గొట్టి సుమారు 6 తులాల బంగారు నగలు, 5 వేల రూపాయల డబ్బు దొంగిలించాడన్నారు. పోలీసు కుక్కలు పసిగట్టకుండా చనిపోయిన ఉమాదేవి పై కారం చల్లాడని పేర్కొన్నారు. ఇంటి బయట ఉన్న ఖలెందర్ కు డబ్బు కొంచమే దొరికిందని పొద్దున్నే ఇస్తాను వెళ్ళిపొమ్మని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. మరుసటి రోజు బంగారు నగలను కుదవబెట్టి ఒక లక్ష 40 వేల రూపాయలు తీసుకుని, కొత్త పల్సర్ బైక్, కొత్త బట్టలు కొని మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. పోలీసుల విచారణ సంధర్బంగా ఆ రోజు రాత్రి ఉమాదేవి ఇంటి ప్రాంతంలో వీళ్ళు ఉండటం చూసి గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కప్పల విజయ్, ఖలందర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఎస్పీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news