కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టే పార్టీ బీజేపీనే : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

-

చేవేళ్లలో బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప సభ ఆ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టే పార్టీ బీజేపీనేనని అన్నారు. వ్యాపారాలు చేసుకునే తనను రాజకీయాల్లోకి పిలిచింది కేసీఆరేనని చెప్పారు. కేసీఆర్ వి అన్నీ డైవర్ట్ దోపిడినేనని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో అమలవుతోన్న పథకాలకు నిధులన్నీ కేంద్రానివేనన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కేంద్రం నిధులన్నీ దోచేశారని.. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆయుష్మాన్ భరత్ తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. భూ సేకరణ పూర్తికాకపోవడంతోనే చేవెళ్ల హైవే పూర్తి కాలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఏమైందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

Konda Vishweshwar Reddy admits BJP using central agencies to target  Opposition - Telangana Today

ఫజల్ బీమా పథకం తెలంగాణలో ఎందుకు అమలు కావడం లేదన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రైతులకు ఫర్టిలైజేషన్ సబ్సిడీ
ఏమైందన్నారు. చేవెళ్లలో ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించలేదని విమర్శించారు. మిషన్ తెలంగాణ సక్సెస్ అవుతదన్నారు. తెలంగాణలో పంట నష్టం పరిహారం ఏదని.. రైతులకు సబ్సిడీ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news