కేసీఆర్ పాలనలో రైతులకు భరోసా లేదు – వైఎస్ షర్మిల

-

బిఆర్ఎస్ ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేసీఆర్ పాలనలో రైతులకు భరోసాయే లేదన్నారు. ఎన్నో కష్టాలకోర్చి పంట పండిస్తే సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు షర్మిల. పాలేరులోని ఐకేపీ సెంటర్ లో నెల రోజులకు పైగా ధాన్యం కుప్పలు పోసి ఎదురుచూస్తున్నా పట్టించుకునే వారే లేరని అన్నారు.

అకాల వర్షాలతో వడ్లు తడిసి మొలకెత్తుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. రైతుల పట్ల నిర్లక్ష్యం తగదన్నారు షర్మిల. సర్కార్ రైతులను ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఆదుకుంటుంది? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి తక్షణమే కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news