ఇంకా నువ్వు ఎందుకు బతికున్నట్టు కేసీఆర్? – వైఎస్ షర్మిల

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విపరీక్షలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కెసిఆర్ హంతకుడు! ఒకేరోజు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. డిగ్రీ చదివి నాలుగేండ్లయినా ఉద్యోగం రాక శివకుమార్ ఉరి వేసుకున్నాడని, 20 రోజులైనా వడ్లకు కాంటాలు వేయక రైతు యల్లయ్య గుండె ఆగిందని, 15రోజులుగా సమ్మె చేస్తున్నా.. సర్కారు స్పందించక జీపీ కార్యదర్శి సోనీ తనువు చాలించిందని.. ఈ ముగ్గురి చావుకు సీఎం కేసీఆర్ ఏ కారణమని ఆరోపించారు.

“తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసుకుంటున్నా.. కేసీఆర్ దొరకు దున్నపోతు మీద వాన పడ్డట్టే. కొలువులు లేక పుట్టెడు దు:ఖంతో యువత.. వడ్లు కొనక కన్నీటి వ్యధతో రైతులు.. ఉద్యోగ భరోసా లేక మనస్తాపంతో కార్యదర్శులు.. చచ్చిపోతున్నా కనికరించవా కేసీఆర్? ఇంకెంతమంది ఉసురు తీసుకుంటావ్? నీ కుటుంబానికి పదవులు కావాలె! మా బిడ్డలకు ఉద్యోగాలు వద్దా? నీ కుటుంబం ఆస్తులు సంపాదించుకోవాలె! మా రైతులు అప్పులు తీర్చుకోవద్దా? నీ కుటుంబం కోట్లకు పడగలెత్తాలె! మా బిడ్డలు పాడె ఎక్కాల్నా? ఇంకా నువ్ ఎందుకు బతికున్నట్టు KCR? బంగారు తెలంగాణ పేరుతో ఆత్మహత్యల తెలంగాణగా మార్చావు కదా?” అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news