సీఎం జగన్ రాజశ్యామల యాగంపై ధూళిపాళ్ల నరేంద్ర సంచలన ట్వీట్

-

విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన రాజశ్యామల యాగం పై టిడిపి సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర తీవ్ర విమర్శలు చేశారు. శత్రువులు నాశనం అయిపోవాలని, కోర్టు కేసుల్లో సానుకూలత రావాలని యాగ సంకల్పం చేసి.. రాష్ట్రం కోసం యాగం చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రజలను నమ్మిస్తున్నారని ఆరోపించారు.

ఈ మేరకు సీఎం జగన్ యాగసంకల్పం వినాలని ఓ వీడియోను సైతం ట్విట్టర్ లో షేర్ చేశారు. ” నీ శత్రువులు నాశనం అయిపోవాలి.. నీ కోర్టు కేసుల్లో సానుకూలత రావాలి.. అంటూ యాగ సంకల్పం చేసి రాష్ట్రం కోసమే యాగం అని నమ్మించే గొప్పవాడివయ్యా! ప్రజలారా.. ఇదిగో ఈ సంకల్పం వినండి ” అని ట్వీట్ చేశారు ధూళిపాళ్ల నరేంద్ర.

Read more RELATED
Recommended to you

Latest news