బ్రేకింగ్‌ : ఏపీలో లోయ‌లో ప‌డిన బ‌స్సు… 10 మంది దుర్మ‌ర‌ణం

-

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మారేడుమిల్లి – చింతూరు మధ్యలోని వాల్మీకి కొండ వద్ద జరిగిన ప్రమాదంలో 10 మంది వ‌ర‌కు మృతి చెందార‌ని సమాచారం. మంగళవారం మధ్యాహ్నం టూరిస్టు బస్సు లోయలో పడింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటకులతో వెళ్తున్న ప్రయివేటు బస్సు.. అదుపుతప్పి లోయలో పడిపోయింది.

ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news