బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని బోర్డుల పేపర్లు లీక్ చేసింది – బల్మూరి వెంకట్

-

బీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్. గ్రూప్ 1 పై రాష్ట్రపతికి, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశానని తెలిపారు. నేరస్తులతోనే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే ఎలా..? అని ప్రశ్నించారు బల్మూరి వెంకట్. గ్రూప్ 1 పేపర్ లీకేజీలో ఏ 1 గా ఉన్న ప్రవీణ్ కి గ్రూప్ 1 పరీక్ష రాయడానికి బోర్డు సెక్రటరీ అనిత రామచంద్రన్ పర్మిషన్ ఇచ్చారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని బోర్డుల పేపర్లు లీక్ చేసిందని ఆరోపించారు.

పేపర్ స్కామ్ పై సిబిఐ విచారణ జరిపిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నా సర్కార్ పరీక్షలు సరిగ్గా చేపట్టడం లేదని మండిపడ్డారు. బిఆర్ఎస్ నాయకుల బంధువులకు ఉద్యోగాలు ఇవ్వడానికే బోర్డులు పనిచేస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news