రైతులకు అండగా పరిశ్రమల ఏర్పాటు : మంత్రి కేటీఆర్

-

బీఆర్ఎస్ సర్కార్ రైతుల అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పట్టణాలతో పాటు గ్రామాల వృద్ధి కోసం విశేష కృషి చేస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అద్భుతమైన పరిశ్రమలు తీసుకువస్తున్నట్టు మంత్రి వివరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఏటా సుమారు 1.5లక్షల మెట్రిక్ టన్నుల మిరప పండిస్తుండగా.. వాటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకి ఉందని ట్వీట్ చేశారు.

ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ రైతులకు అండగా నిలిచేందుకు ఏటా సుమారు 1 లక్ష మెట్రిక్ టన్నుల మిరపకొనుగోలు చేయగల రెండు సంస్థలకు వేగంగా భూమి కేటాయించటంతో, సంస్థ ఏర్పాటుకు ఇన్సెంటివ్‌లు ఇచ్చి ప్రభుత్వం తనవంతు కృషి చేసిందన్నారు. దీంతో కురవి మండలంలో 70కోట్లతో ప్లాంట్ లిపిడ్స్ సంస్థ, మరిపెడ మండలంలో 50 కోట్లతో విద్యా హెర్బ్స్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. విద్యాహెర్బ్స్ అదనంగా మరో 150కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉందన్న మంత్రి… ప్లాంట్ లిపిడ్స్ సైతం సంస్థను విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news