హెలికాప్టర్‌లో ఖమ్మం బయలుదేరిన రాహుల్ గాంధీ

-

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకన్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీకి ఏపీ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం తెలిపారు. శాలువాలతో సన్మానించారు. ఆ తర్వాత స్పెషల్ హెలికాప్టర్ వరకు నడుచుకుంటూ వెళ్లి హెలికాప్టర్ ఎక్కారు. అక్కడి నుంచి ఖమ్మం జనగర్జన సభకు బయలుదేరారు.

Police, govt machinery creating hurdles for people attending Rahul Gandhi's  meeting at Khammam: Congress in Telangana | Deccan Herald

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకంగా భావిస్తున్న భారీ బహిరంగ సభ ‘జన గర్జన’ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఖమ్మం జిల్లాలోని ఎస్ఆర్ గ్రౌండ్స్‌లో 150 ఎకరాల్లో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్​ మార్చ్​ పాదయాత్ర నేడే ముగియనుండడం, జన గర్జన సభలోనే ఖమ్మం జిల్లా కీలక నేతలు పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనుండడంతో ఈ బహిరంగ సభ ప్రాధాన్యం సంతరించుకుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news