తెలంగాణ రాజకీయాలు : BRS కు మరో బిగ్ షాక్… !

-

తెలంగాణాలో కేసీఆర్ నేతృత్వంలోని BRS పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. గత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లను ఓడించి వరుసగా గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది. కానీ ఈసారి ఇది జరుగుతుందా అంటే సందేహమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి… రెండు పర్యాయాలుగా కేసీఆర్ అధికారంతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని తెలుస్తోంది. ఇది కాకుండా ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలలో కూడా అసంతృప్తి ఉండనే విషయం క్లియర్ గా అర్థమవుతోంది. ఈ మధ్యనే BRS లో ఉన్న సీనియర్ నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరియు జూపల్లి కృష్ణారావు లు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇక నిన్ననే ఆ పార్టీ సీనియర్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి సైతం పార్టీ మారిన విషయం తెలిసిందే. ఇలా షాకుల మీద షాకులు తగులుతున్న BRS కు కాసేపటి క్రితమే మరో బిగ్ షాక్ తగిలింది.

BRS పార్టీ కి చెందిన గద్వేల్ జెడ్పి చైర్ పర్సన్ సరితా కేసీఆర్ కు గుడ్ బై చెప్పారు. ఈమె రేపు ఢిల్లీకి వెళ్లి అక్కడ కాంగ్రెస్ నాయకుల సమక్షములో కాంగ్రెస్ లో చేరనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news