కిషన్ రెడ్డిని సీఎం చేయాలి – ఎంపీ సోయం బాపూరావు

-

గురువారం డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు బయలుదేరిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కిషన్ రెడ్డి అరెస్ట్ కు బదులు తీర్చుకోవాలంటే వచ్చే ఎన్నికలలో బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చి కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు.

నేడు కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం నిర్వహించిన సభలో సోయం బాబూరావు మాట్లాడుతూ.. తన పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో బిజెపిని గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ నాయకుల నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. పార్టీలో పాత, కొత్త నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ ని ఓడించి పగ తీర్చుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు బిజెపికి ఓటు వేశారు కాబట్టే తాను ఎంపీగా గెలిచానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news