ఓటీటీలోకి సునీల్ ‘భువనవిజయమ్‌’ సినిమా.. కానీ చిన్న ట్విస్ట్..?

-

టాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్‌, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఫన్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘భువనవిజయమ్‌’. యలమంద చరణ్‌ తెరకెక్కించిన ఈ సినిమా మే నెలలో థియేటర్లలో విడుదలైంది. ఎంతో కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సునీల్ కు ఈ సినిమా కూడా నిరాశే మిగిల్చింది. ఫన్ ఎంటర్టైర్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది.

థియేటర్లో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా.. ఈ చిత్రంలో సునీల్, వెన్నెల కిశోర్, శ్రీనివాస రెడ్డి వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించడంతో ఓటీటీ ప్రేక్షకులు ఓసారి ఈ చిత్రాన్ని చూడాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా నేటి నుంచి ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని వీక్షించాలంటే రూ.99 చెల్లించాల్సి ఉంటుంది.

ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటంటే..  నిర్మాత చలపతి…. నటుడు ప్రీతమ్ కుమార్(సునీల్)తో ఓ సినిమా చేయాలని అనుకుంటాడు. అందుకోసం కొంతమంది రచయితలను తన కార్యాలయానికి ఆహ్వానించి కథలు వింటాడు. అలా, ఏడుగురు రచయితలు చెప్పిన కథలు ఆయనకు నచ్చుతాయి. అయితే, ఆ రచయితలందరూ కలిసి ఒక కథ ఫైనల్‌ చేయాల్సి వస్తుంది. ఆ క్రమంలోనే వారి మధ్య గొడవలు తలెత్తి.. ఒకరు చనిపోయే పరిస్థితి వస్తుంది. ఇంతకీ ఆ చనిపోయే వ్యక్తి ఎవరు? చలపతి ఆఫీస్‌లో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన వ్యక్తిని యమదూతలు ఏమైనా కాపాడారా? వంటి ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news