అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం – రఘునందన్ రావు

-

అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం సుదీర్ఘంగా సాగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ప్రజల సమస్యలకు పరిష్కారంపై చర్చించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. 9 ఏళ్లలో పాత బస్తీకి 5.5 కిలోమీటర్ల మెట్రో లైన్ పూర్తి చేయడం చేతకాని ప్రభుత్వం ఇప్పుడు నాలుగేళ్లలో మెట్రో రైలును భాగ్యనగరం చుట్టూ విస్తరిస్తామని చెప్పడం ఎన్నికల స్టంట్ అని ఆరోపించారు.

రియల్ ఎస్టేట్ ను పెంపొందించేందుకే హైదరాబాద్ చుట్టూ మెట్రో అంటూ మాటలు చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. కేబినెట్ సమావేశంలో కడెం ప్రాజెక్టుపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. కడెం ప్రాజెక్టు ఇబ్బందుల్లో ఉందన్న రఘునందన్.. ప్రాజెక్టు గేట్లు సరిగ్గా పనిచేయడం లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news