ఐపీఎల్ స్టార్ట్ అయ్యి సీజన్ లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది, కానీ ఇప్పటి వరకు అసలు ఐపీఎల్ టైటిల్ రుచి చూడని జట్లుగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు లు నిలిచిపోయాయి. అందులో రాత మారని ఘోరమైన జట్టుగా బెంగుళూరు పై ముద్రపడిపోయింది. ప్రతి సీజన్ లో బెంగుళూరు స్క్వాడ్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్లేయర్ లు ఉంటారు, ఈసారి కప్ మనదే అంటూ అభిమానులు ఆనందంలో మ్యాచ్ లకు హాజరవుతూ ఉంటారు. కానీ కట్ చేస్తే బెంగుళూరు జట్టు ప్లే ఆప్స్ చేరకపోవడమో, లేదా క్వాలిఫైయర్స్ లో ఓటమి చెండంతో జరిగి నిరాశ పరుస్తూ వచ్చింది. దానితో బెంగుళూరు జట్టు యాజమాన్యం కోచ్ ను మార్చడానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు హెడ్ కోచ్ గా ఉన్న సంజయ్ బంగారు ను తీసివేసి, అతని స్థానంలో జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ ను నియమించుకుంది.
అయితే ఫ్లవర్ లక్నో సూపర్ జాయింట్స్ కు హెడ్ కోచ్ గా ఉండగా.. ఇప్పుడు బెంగుళూరు కు మారాడు. మరి రానున్న ఐపీఎల్ లో అయినా బెంగుళూరు నుండి అద్భుతం ఆశించవచ్చా అన్నది అభిమానుల ప్రశ్న ?